విజయవాడ బస్టాండ్లో దూసుకొచ్చిన బస్సు, ముగ్గురు మృతి
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం వేచి ఉన్న ప్రయాణికులపైకి బస్సు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) బస్సు ఫెన్సింగ్ను ఢీకొని ప్లాట్ఫారమ్పైకి ఎక్కి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. బాధితుల్లో బస్ కండక్టర్, ఓ మహిళ, బాలుడు ఉన్నారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 12వ నంబర్ ప్లాట్ఫారమ్పై గుంటూరు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ మెట్రో లగ్జరీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ రివర్స్ గేర్కు బదులు మొదటి గేర్ని వేయడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.