మాజీ మంత్రి ఇంట్లో చోరీ
హైదరాబాద్ ఫిలిం నగర్ లోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ ఘటనపై ఫిలింనగర్ పోలీసులకు పొన్నాల భార్య అరుణా దేవి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.