Home Page SliderPoliticsTelanganatelangana,

ధరణి పోర్టల్ ద్వారా బీఆర్‌ఎస్ దోపిడీ..భట్టి

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అడ్డు పెట్టుకుని నేతలు వేల ఎకరాల భూమిని దోపిడీ చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ  ఆ వివరాలన్నీ బయటకు తీస్తామని పేర్కొన్నారు. హైడ్రా, మూసీ నది పునరుజ్జీవనం విషయంలో ప్రభుత్వం బాగా ఆలోచించే ముందుకు కొనసాగుతోందన్నారు. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.