Home Page SliderTelangana

మున్సిపల్ కార్మికులు విధుల బహిష్కరణ

ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం ఉదయం విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. సీఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. పీఆర్సీ ఎరియర్స్ బకాయిలు, రెండేళ్ల పీఎఫ్ బకాయిలు, మే డే కానుక బకాయిలు చెల్లించాలని కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న తమ సమస్యల పరిష్కారానికి పాలకులు, అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.