షార్ కు బాంబు బెదిరింపు..
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)కు బాంబు బెదిరింపు వచ్చింది. షార్ లో తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఆదివారం అర్ధరాత్రి ఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీనితో తిరుపతి జిల్లా శ్రీహరికోట సోమవారం తెల్లవారుజాము నుంచి షార్ పరిసరాల్లో అణువణువూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ బృందాలు, పోలీసులు బలగాలు పాల్గొన్నాయి. సముద్ర మార్గాల్లోనూ తీరప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల అనంతరం బెదిరింపు ఫోన్ కాల్ ఆకతాయిలు చేసిన పనిగా భద్రతా బలగాలు తేల్చాయి.