NewsTelangana

ఐటీ, ఈడీ దాడులతో బీజేపీ భయపెట్టలేదన్న మంత్రి మల్లారెడ్డి

తనను, తెలంగాణ రాష్ట్ర సమితిని లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన పెద్ద కుట్రలో భాగమే తనపై, తన కుటుంబ సభ్యులపై ఐటీ దాడులంటూ ఆరోపించారు తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి.  ఇతర రాష్ట్రాలకు టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా విస్తరిస్తుంటే… బీజేపీ భయపడుతోందని, చివరికి ముప్పు కలుగుతోందని ఇలా చేస్తున్నారన్నారు. కానీ ఐటీ దాడులకు భయపడబోనన్నారు మల్లారెడ్డి. ఎలాంటి తప్పు చేయనందున సంబంధిత అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఐటీ దాడులు రాజకీయ పగతో కూడుకున్నవన్న మంత్రి, ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర సంస్థల ద్వారా దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు… ఇప్పటికే మంత్రులు, శాసనసభ్యులందరినీ హెచ్చరించారని చెప్పారు. తన విధేయత ముఖ్యమంత్రిపై ఉందని, కేంద్రం ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

Hyderabad Police registers complaints against Telangana minister Malla Reddy & I-T official inolved in raids - India Today

అయితే ఐటీ దాడుల పేరుతో తన కుటుంబంతో పాటు తన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారిపై కేంద్రం వేధింపులు, మానసిక హింసకు గురిచేస్తోందని మల్లారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదాల పేరుతో వందలాది మంది ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించి తన నివాసంతో పాటు విద్యాసంస్థల వద్ద భయాందోళనలు సృష్టించారని అన్నారు. ఐటీ అధికారులు తన కొడుకుకు తెలియకుండానే కొన్ని కాగితాలపై సంతకం చేయమని బలవంతం చేస్తే, మనవళ్లను కూడా వదిలిపెట్టలేదని ఆక్రోశం వెళ్లగక్కారు. తమపై ఇది మూడో I-T రైడ్, అని హ్యాట్రిక్ అని… ఈ రకమైన దాడిని ఎప్పుడూ చూడలేదన్నారు. దౌర్జన్యం ఎందుకని ప్రశ్నించారు. స్మగ్లర్లమా లేక నేరస్తులమా అంటూ ప్రశ్నించారు. ఆదాయానికి సంబంధించిన అన్ని రికార్డులను తనిఖీ చేయడానికి మరియు వారి విచారణను నిర్వహించడానికి I-T డిపార్ట్‌మెంట్‌కు స్వేచ్ఛ ఉందని… కానీ నాతో, ఇతర కుటుంబ సభ్యులతో అమానవీయంగా ప్రవర్తించాల్సిన అవసరమేంటన్నారు మల్లారెడ్డి.

Malla Reddy: I-T teams raid minister Ch Malla Reddy and kin for suspected tax evasion | Hyderabad News - Times of India

మల్లారెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని మరోవైపు పార్టీ బాసటగా నిలిచింది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు లేదా తన కుటుంబం నడుపుతున్న ఇతర సంస్థలలో అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను టీఆర్ఎస్ ఖండించింది. మల్లారెడ్డి రికార్డులు తెరిచిన పుస్తకాల్లాంటవింది గులాబీ పార్టీ. ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాల ప్రకారం అన్ని అడ్మిషన్లు జరుగుతున్నాయని… అక్రమంగా డొనేషన్లు, ఇతర రుసుములు వసూలు చేశారన్న ఆరోపణలను తిప్పికొట్టింది. అన్ని చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున లేదా చట్టబద్ధమైన పద్ధతిలో తనిఖీలు జరుగుతున్నందున అలాంటి ఆరోపణలు చేసే వారు రికార్డులను తనిఖీ టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడింది.