Home Page SliderTelangana

తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో వేల కొద్దీ కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించి, బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్దారించారు. చనిపోయిన కోళ్లను జేసీబీతో గుంత తీసి ఫామ్ యజమానులు పూడ్చి పెట్టారు. కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ బర్డ్ ఫ్లూ వల్ల పౌల్ట్రీ ఫామ్ యజమానులు భారీనష్టాలతో శోకసంద్రంలో మునిగిపోయారు.