వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్..
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ధర్మాసనం ఆసక్తి చూపలేదు. మైనింగ్ వాల్యూయేషన్ పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అనంతరం, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని సుప్రీం కోర్టుకు తెలిపారు. అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 100 రోజులకు పైగా జైలులో గడిపిన వంశీని అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో విడుదల కాకుండా చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కూటమి కేసులు పెట్టిందని వంశీ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.

