స్టేడియంలో బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్స్..
దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, భారత్ , పాకిస్థాన్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా టీం ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి చాలా మంది తెలుగు యాక్టర్స్ దుబాయ్ చేరుకొని లైవ్లో పాక్, ఇండియా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే అందాల భామ ఊర్వశి రౌతేల కూడా ఈ మ్యాచ్లో మరింత స్పెషల్గా కనిపించింది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అది ఏమిటంటే? ఈ ముద్దుగుమ్మకు ఓ మహిళ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. ఊర్వశీ రౌతేల పుట్టిన రోజు ఫిబ్రవరి 25. కానీ తన పుట్టిన రోజుకు రెండు రోజుల సమయం ఉండగానే, దుబాయ్ క్రికేట్ స్టేడియంలో అక్కడి సిబ్బంది ఈ బ్యూటీకి కేక్ తీసుకొచ్చి ఇచ్చారు. అలా ఈ ముద్దుగుమ్మ అటు పాకిస్తాన్ జనాలు క్రికెటర్స్, ఇటు ఇండియా క్రికెటర్స్, ప్రేక్షకుల మధ్య తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.