పోసానికి బెయిల్ మంజూరు..
చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో పోసాని మీద మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. మొదట నాలుగు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసుల్లో వరుసగా పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన రిలీజ్ అవుతారని అనుకున్నారు. కానీ ఆ నాలుగు కేసుల్లో బెయిల్ రాగానే పోసాని మీద మరో ఫిర్యాదు అందింది. దీంతో సీఐడీ ఆయనను అదుపులోకి తీసుకుంది. దీంతో బెయిల్ వచ్చినా పోసాని జైలులోనే ఉన్నారు. ఇప్పుడు ఆ కేసులో కూడా బెయిల్ రావడంతో త్వరలోనే ఆయన జైలు నుంచి రిలీజ్ కానున్నారు.


 
							 
							