బీసీల “కుల గణన” సమావేశం
తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ మరియు కమిషన్ సభ్యులు ఈ రోజు పూర్వ బీసీ కమిషన్ అధ్యక్షులు మరియు సభ్యులతో సమావేశమై బీసీల “కుల గణన” మరియు రిజర్వేషన్ ల విషయమై సంప్రదింపులు చేశారు. ఈ సమావేశం లో పాల్గొన్న సభ్యులకు తాము గతం లో సేకరించినటువంటి సమాచారాన్ని సమావేశం లో వ్యక్తపరచి ప్రస్తుత కమిషన్ కు అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమలో ఛైర్మన్ శ్రీ జి.నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి బాల లక్ష్మి గార్లు పాల్గొనగా పూర్వ బీసీ కమిషన్ ఛైర్మన్ శ్రీ.బి.ఎస్. రాములు, డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మరియు సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ , జూలూరి గౌరీ శంకర్, సి.హెచ్, ఉపేంద్ర, శుభ ప్రద్ పటేల్, కే. కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.