సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అసదుద్దీన్
ఢిల్లీ లోని సీఎం అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డితో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కలిశారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో హైడ్రా కూల్చివేతలు, ఓల్డ్ సిటీ, నాంపల్లిలో ఇటీవల నెలకొన్న పరిస్థితులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. మూసీ ప్రక్షాళనలో భాగంగా చేపడుతున్న కూల్చివేతల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం పేదల ఇండ్లకు అధికారులు మార్క్ చేశారని సీఎం దృష్టికి ఒవైసీ తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆ బాధితులను ఆదుకోవాలని కోరినట్టు సమాచారం.


 
							 
							