Home Page SliderTelangana

పథకాల పేరుతో తెచ్చిన అప్పులు పక్కదారేనా?: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. వారికి రూ.20 వేల బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇవ్వలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి.. బస్సులు తగ్గించారు. తెలంగాణ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత మేం తీసుకున్నాం. హామీల అమలు కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తాం. కర్ణాటకలో కూడా హామీలు అమలు కావడం లేదు. రాష్ట్రం ఏర్పాటై పదేళ్లయినా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో మహిళలు గ్యాస్ కనెక్షన్లు పొందలేదపోతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని మోడీ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు అని కిషన్ రెడ్డి తెలిపారు.