Home Page SliderNational

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఈ నెల 21, 22 న తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.