ఏపీలో 1000 కోట్లతో మరో పరిశ్రమ, 2 వేల మందికి యువతకు ఉపాధి
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం జగన్ తో చర్చించారు. పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, ఆయనకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు సీఎం. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో రూ. 1000 కోట్ల మూలధన పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్ గ్లాస్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రికి వరుణ్ గుప్తా వివరించారు. ఈ ప్లాంట్ వల్ల 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.