అమెరికా ప్రభుత్వంలో మరో ఇండో –అమెరికన్ మహిళ
అమెరికా ప్రభుత్వంలో తాజాగా మరో ఇండో- అమెరికన్ మహిళకు చోటు దక్కింది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా బైడన్ ప్రభుత్వంలో ఇప్పటికే భారతీయ అమెరికన్లు150 మంది కీలక పదవులలో ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త, ‘మాస్టర్ కార్డ్ సెంటర్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్’ వ్యవస్థాపకురాలు ‘షమీనా సింగ్’కు కీలక పదవి దక్కింది. ఆమెను ఎగుమతుల మండలి సభ్యురాలిగా నియమించారు బైడన్. ఈ విషయం వైట్ హౌస్ ప్రకటించింది. ఈ నియామకంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఎగుమతుల కమిటీలో చేరడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ కమిటీ అధ్యక్షునికి ప్రధానంగా వాణిజ్యం, ఎగుమతులు వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల కోసం సలహాలు ఇస్తుంది. ఆమె గతంలో కూడా శ్వేతసౌధంలో ప్రతినిధుల సభలో కీలక పదవులు చేపట్టారు. 2015లో ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆమె బోర్డు సభ్యురాలిగా పని చేశారు. అంతేకాక ఆసియాన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్పై మొదటి అధ్యక్ష సలహా కమిషన్కు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్గా కూడా వ్యవహరించారు.