Home Page SliderNational

యూపీలోని యోగి సర్కార్ శ్రీరామ భక్తులకు మరో కానుక!

అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న తరుణంలో యూపీలోని యోగి సర్కార్ శ్రీరామ భక్తులకు మరో కానుకను ప్రకటించింది. శ్రీరాముడు కొలువైన అయోధ్యలో వాటర్ మెట్రో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది భక్తులకు వరం కానున్నదని అధికారులు అంటున్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ వాటర్ మెట్రో అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకు ప్రయాణిస్తూ, పర్యాటకులకు అయోధ్య సంస్కృతిని పరిచయం చేయనుంది. దేశంలో ఇది మొట్టమొదటి వాటర్ మెట్రోగా గుర్తింపు పొందింది. ఈ వాటర్ మెట్రో 2024, జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజున ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ వాటర్ మెట్రో సరయూ నదిలో ముందుకు సాగనుంది. ఇది పర్యాటకులను అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకూ.. గుప్తర్ ఘాట్ నుండి అయోధ్యకు తీసుకువెళ్లి, తీసుకు వస్తుంటుంది.