Andhra PradeshHome Page Slider

చంద్రబాబుపై మరో కేసు.. ఉచిత ఇసుకతో ఖజానాకు పదివేల కోట్ల గండి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే మధ్యంతర బెయిల్ పొంది 24 గంటలు తిరగకముందే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరో వ్యవహారం తెరపైకి వచ్చింది గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధాన నిర్ణయాల ఫలితంగా పదివేల కోట్ల రూపాయల మేర ఖజానాకు గండి పడిందని అభియోగాలతో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి సిఐడి మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడుసార్లు ఇసుక విధానాన్ని మార్చారని ఉచిత ఇసుక పథకం ద్వారా తన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూరాలని తీసుకున్నారనేది ప్రధాన అభియోగం.

దీంతో ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసులో ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీతల సుజాతా ఏ1, చంద్రబాబు నాయుడు ఏ2, చింతమనేని ప్రభాకర్ ఏ3, దేవినేని ఉమాలు ఏ4గా ఉన్నారు. వీరు అక్రమ మైనింగ్‌ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండిపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిపారని తెలిపారు. గతంలో చంద్రబాబు చేసిన పర్యావరణ నష్టానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ రూ. 100 కోట్లు జరిమానా విధించిందని వైసీపీ ఆరోపణలు గుప్పించింది.


ఉచితంగా పేదలకు ఇసుక అందిస్తామన్న ముసుగులో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించి అదినంత దోచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచితంగా ఎంత మంది పేదలకు ఇసుకను అందించారో రికార్డ్ బయటకు తీయాలన్న లక్ష్యం కన్పిస్తోంది. రాష్ట్రంలో 1000కు పైగా అక్రమ ఇసుక మైనింగ్ కేసులు నమోదయ్యాయి. వసూలు చేసిన పెనాల్టీ విలువ రూ. 40 కోట్లు. దీనికి సంబంధించిన వివరాలను, వాటి లెక్కలను చూపించాలని పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానం ద్వారా ఖనిజ వనరుల దోపిడీదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చట్టబద్ధమైన బకాయిలు కోట్లాది రూపాయలు చెల్లించలేదన్నారు. తమ పార్టీలోని రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారని చెబుతూ మరిన్ని అంశాలు పొందుపరిచారు.