Home Page SliderTelangana

సీఎంని కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

తెలంగాణలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎంని కలవడం ఆసక్తిగా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తన నియోజక వర్గమైన నియోజకవర్గమైన దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేగాక యూనివర్సిటీ నెలకొల్పేందుకు కావాల్సిన స్థల పరిశీలనకు దుబ్బాక వెళ్లాలని సీఎంఓకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం. అలాగే దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న హబ్సీపూర్- లచ్చపేటకు రెండు డబుల్ రోడ్డు నిర్మాణానికి సీఎం రూ.35 కోట్లు మంజూరు చేశారు.