Andhra PradeshHome Page Slider

ఘనంగా ఏపీలో రిపబ్లిక్ డే వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లో ఘనతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ గన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో ప్రభుత్వ పథకాల పేద ప్రజలకు అందుతున్నాయన్నారు గవర్నర్. డీబీటీ ద్వారా నవరత్నాల పథకాల ప్రజలకు నేరుగా చేరుతున్నాయన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమం చేరువయ్యిందన్నారు.