Andhra PradeshHome Page Slider

అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అర్జున్ పై నంద్యాల పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి వచ్చే నెల 6న ఉత్తర్వులిస్తామని, అప్పటివరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే.. గత ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ నేత రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేయగా, ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి అల్లుఅర్జున్ వచ్చారు. వైసీపీ అభిమానులు భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయన్ను తీసుకువచ్చారు. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిలపై అప్పట్లో నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.