ఎన్నికల అఫిడవిట్ కేసులో ఆలేరు ఎమ్మెల్యేకు పది వేల జరిమానా
ఆలేరు ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై దాఖలైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు మండిపడింది. ఎమ్మెల్యే తీరుపై కోర్టు సీరియస్గా పది వేల జరిమానా విధించింది. అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2018 ఎన్నికల సందర్భంగా గొంగిడి సునీతామహేందర్ రెడ్డి వేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్యరెడ్డి ఇంప్లీడ్గా ఉన్నారు. ఆస్తులు సరిగా చూపలేదని, సునీత ఎన్నిక చెల్లదంటూ సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేకు జరిమానా విధించిన కోర్టు.. కేసు విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది.