తీరప్రాంత గ్రామాలకు అలర్ట్
కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్గా ఉండాలంటూ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదిలో పడవలు, చిన్న బోట్లలో ప్రయాణించవద్దని హెచ్చరించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి, నాగార్జున సాగర్ నుండి కృష్ణానది ప్రవాహం భారీగా పెరగడంతో ఈ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నదిలో ఈతలు కొట్టడం, చేపలు పట్టడం కూడా చేయవద్దని, జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొంది. పల్లె ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేశారు.

