నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసు పై బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే హేమా తనపై నమోదైన డ్రగ్స్ కేసు కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించి.. విచారణపై స్టే కోరుతూ దాఖలు చేసిన ఇంటర్లో క్యూటరీ అప్లికేషన్ ను అనుమతిస్తూ విచారణ జరిపిన న్యాయస్థానం స్టే ఇచ్చింది. అయితే.. గత ఏడాది బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ అని తేలడం కలకలం రేపింది. పాజిటివ్ వచ్చిన వారిలో నటి హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు ఉన్న విషయం తెలిసిందే.