home page sliderHome Page SliderTelangana

తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసాడు ఓ యువకుడు

తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసాడు ఓ యువకుడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రమణ(25) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. దీంతో రమణ అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. రమణ కళ్లు, కిడ్నీలు, గుండెను సేకరించి ఆరుగురి ప్రాణాలు నిలబెట్టినట్లు జీవన్ దాన్ తెలంగాణ పేర్కొంది.