హైదరాబాద్ చేరుకున్న సీఎం.. రేవంత్ కు ఘన స్వాగతం
దావోస్ టూర్ ను సక్సెస్ ఫుల్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తొలుత సింగపూర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చున్నారు. అనంతరం అక్కడి నుంచి దావోస్ చేరుకుని వరల్డ్ ఎనమిక్ ఫోరంసదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించారు. ఆయన కృషి ఫలించడంతో రాష్ట్రానికి రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు తీసుకురాగా, ఈసారి అంతకు నాలుగు రెట్ల పెట్టుబడులు సాధించారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 50 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది.