సచిన్కు ప్రతిష్టాత్మక అవార్డు
క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించనుంది. రేపు జరగబోయే బీసీసీఐ వార్షికోత్సవంలో సచిన్కు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇయర్ 2024’ పురస్కారం ఇచ్చి సన్మానించబోతున్నారు. ఈ పురస్కారం ఇవ్వబోయే 30 వ భారత క్రికెటర్గా ఆయన నిలుస్తున్నారు. నిరుడు రవిశాస్త్రి, ఫరూఖ్ ఇంజినీర్లకు ఈ అవార్డు లభించింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఘనమైన రికార్డులు సాధించిన సచిన్కు ఈ అవార్డు ప్రధానం చేయడం ఎంతో సంతోషమని, భారత క్రికెట్కు ఆయన అందించిన సేవలు అద్భుతమని వారు పేర్కొన్నారు. భారత్ నుండి 664 మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్ సచిన్. ప్రపంచ చరిత్రలోనే ఆయన ఆరుసార్లు వన్డే ప్రపంచకప్లో పాల్గొన్న క్రికెటర్గా నిలిచారు.

