నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉద్రిక్తత..
నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికుల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి దాడికి పాల్పడ్డారు కార్మికులు.పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేశారు. తర్వాత కార్మికుల ఆందోళనకు దిగారు. మార్కెట్ ఛైర్మన్ ను నిలదీశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీగా వచ్చిన కార్మిక సంఘాలు.. ఛైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించాయి. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్మికుల సమ్మెతో విక్రయాలు స్థంభించిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి క్రయ విక్రయాలు పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.