Breaking NewsHome Page SliderInternational

ఉగ్యోగం ఇచ్చిన ఓన‌ర్‌పై ఎస్సీ,ఎస్టీ కేసు

l.పైగా అన్నం పెట్టిన చేయినే న‌రికేస్తుంటారు.ఈ కోవ‌కు చెందిన వ్య‌క్తి ఇన్పోసిస్‌లో క‌నిపించాడు. మాజీ ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ దుర్గప్ప …ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగంలో నుండి తొలగించారని, తనపై కులపరమైన విమర్శలు, బెదిరింపులు చేశారని దుర్గ‌ప్ప‌ ఫిర్యాదు చేశాడు. యాజ‌మాన్య నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హరించ‌డ‌మే కాకుండా ,సంస్థ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే ఫిర్యాదులు అంద‌డంతో గ‌తంలో దుర్గ‌ప్ప‌ను సంస్థ నుంచి తొల‌గించారు.దీంతో ర‌గిలిపోయిన దుర్గ‌ప్ప ఏకంగా స‌హ వ్య‌వ‌స్థాప‌కుని మీదే కేసు పెట్టారు. గిరిజన తెగకు చెందిన దుర్గప్ప ఫిర్యాదుతో క్రిస్ గోపాలకృష్ణన్‌తో పాటు మరో 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.