మంచి డాక్టర్ కు చూపించుకో.. తర్వాత మాట్లాడు..
పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. కవిత మంచి డాక్టర్ కు చూపెట్టుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. జైల్లో ఉన్నప్పుడు కవిత ఆరోగ్యం బాగోలేదు..చెల్లె కవిత ఇప్పటికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది.. మంచి డాక్టర్ కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే బాగుంటుందని రఘునందన్ రావు సైటెర్లు వేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కి రైతులు ఎందుకు గుర్తుకు రాలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్ కి ప్రేమ పెరిగిందా..? అందుకే రైతు ధర్నాలు చేస్తున్నాడని రఘునందన్ రావు చురకలు అంటించారు.

