సావర్కర్ పేరు వద్దు.. మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి
ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలో నిర్మించనున్న ఓ కళాశాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. నజాఫ్ గఢ్ లో రూ. 140 కోట్లతో కళాశాల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు పెట్టారు. ఈ పేరుపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పి సావర్కర్ పింఛను తీసుకున్నారని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUI నేతలు విమర్శించారు. అలాంటి వ్యక్తి పేరు కాలేజీకి పెట్టవద్దని కోరారు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను స్థాపించిన దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

