Home Page SliderTelangana

పట్నంకి హైకోర్టులో భారీ ఊరట

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లగచర్ల ఘటనకు ముందే బొంరాస్ పేటలో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు చేయకుండా బెయిల్ ఇవ్వాలని నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారించిన హైకోర్టు.. బెయిల్ మంజూరు చేయడంతో పాటు విచారణకు సహకరించాలని పట్నం నరేందర్ రెడ్డిని ఆదేశించింది. అయితే లగచర్ల దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు.