Home Page SliderTelangana

మంటల్లో ఆంజనేయుడి విగ్రహం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర అపచారం జరిగింది. మహాదేవపూర్ మండలంలోని కాకతీయుల కాలంనాటి అమరేశ్వర స్వామి దేవస్థానం ఉపాలయంలో మంటలు చెలరేగడంతో గుడిలోని ఆంజనేయుడి విగ్రహం పూర్తిగా కాలిపోయింది. గురువారం సాయంత్రం దేవాలయంలో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో విగ్రహంపై ఎలాంటి వస్త్రం, అగ్నికి కారణమయ్యే ఎలాంటి వస్తువులు లేవని పూజారి నాగరాజు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారా అనేది తెలియడం లేదని చెప్పారు. అయితే.. ఇవాళ ఉదయం స్థానిక భక్తులు ఆలయంలో శాంతిపూజలు నిర్వహించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి..దర్యాప్తు చేస్తున్నారు.