Andhra PradeshHome Page Slider

జగన్ ట్వీట్‌పై స్పందించిన బుద్దా వెంకన్న

మాజీ సీఎం జగన్ ఈ రోజు తాడేపల్లిలో కూల్చేసిన వైసీపీ కార్యాలయం ఘటనపై ట్వీట్ చేశారు. కాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే లీజుకు తీసుకున్నారన్నారు. కాగా అక్కడ అనుమతులు లేకుండా అవినీతి సొమ్ముతో..వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించబోయారు. దీంతో అనుమతులు లేవని అధికారులే దాన్ని కూల్చివేశారు.జగన్‌లా ప్రజావేదికను కూల్చలేదన్నారు.