NationalNewsNews Alert

స్వాతంత్రానికి ముందు త్రివర్ణ పతాకమిదిగో..!

ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1946 నవంబరులో ఆవిష్కరించిన ఖద్దరు త్రివర్ణ పతాకను మహారాష్ట్రలో ప్రదర్శించారు. దీనిని పుణె సమీపంలోని పిప్రి చించ్వాడ్‌లోని ఒక కళాశాలలో ఉంచారు. ప్రదర్శనలో ఉన్న ఈ త్రివర్ణ పతాకాన్ని విక్షించేందుకు వేల సంఖ్యలో జనాలు క్యూ కడుతున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు ఈ జెండాను ప్రదర్శనకు ఉంచునున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 5వేల మంది దీనిని వీక్షించగా … అందులో అధిక శాతం విద్యార్ధులే ఉండటం విశేషమని చెప్పోచ్చు. మేజర్ గణపత్ రామ్ నాగర్ కుటుంబం వద్ద ఇన్ని సంవత్సరాలు ఈ జెండా పదిలంగా ఉంది. అప్పటి సుభాష్ చంద్ర బోస్ నాయకత్వంలో బ్రిటిష్ వారిపై పోరాడిన భారత జాతీయ సైన్యం మూడో డివిజన్‌కు నాయకత్వం వహించిన వారే ఈ గణపత్ రామ్ నాగర్.

స్వాతంత్రానికి ముందు 1946 నవంబర్ 24న మేరాఠ్‌లోని విక్టోరియా పార్కులో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఈ జెండాను ఆవిష్కరించగా , ఈ సభ బాధ్యతలు మెత్తం తన తాతగారైన మేజర్ జనరల్ నాగర్‌కు అప్పగించారని మేరాఠ్‌లోని ఓ కళాశాలలో ప్రిన్సిపల్‌గా చేస్తున్న దేవ్ నాగర్ తెలిపారు. మహాసభ చివరి రోజున పతాకాన్ని ఐఎన్ఏ జనరల్ షాజవాన్ ఖాన్‌లు ఆ జెండాపై సంతకం చేసి తిరిగి తాత గారికి అప్పగించారని చెప్పారు. స్వాతంత్రానికి ముందు త్రివర్ణలో ఉన్న రంగుల రాట్నం బదులుగా అశోక చక్రాన్ని ముద్రించారు. రాట్నం గుర్తు ఉన్న త్రివర్ణన్ని ఇంతకముందు 125 సుభాష్ చంద్ర బోస్ జయంతి నాడు , బంగ్లాదేశ్ యుద్ధం ముగిసిన 50 ఏళ్లయిన సందర్భంలోనూ ప్రదర్శించారు. ఈ పతకం స్వాతంత్ర భారతానికి ఓ జాతీయ పతాకంగా మారుతుందని నెహ్రూ పేర్కొన్నారని ఈ ఆజాదీ కా అమృతోత్సవ్‌లో గుర్తుచేసుకున్నారు.