NewsTelangana

హైకోర్టులో మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు విచారణ

మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో ప్రభుత్వ అప్పీల్‌ను హైకోర్టు పరిగణలోకి తీసుకొంది. 24 గంటల్లోగా ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. మొత్తం మీద ఫౌంహౌస్ నిందితుల రిమాండ్‌కు కోర్టు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఒకవేళ లొంగకపోతే వారిని అరెస్ట్‌ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలని.. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. 

ఇదిలా ఉండగా.. మరోవైపు.. బీజేపీలో చేరితే కోట్ల రూపాయల నగదు ఇస్తామంటూ ప్రలోభ పెట్టడంపై మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తును సిట్‌ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 4వ తేదీ వరకు దర్యాప్తుపై స్టే విధించిన న్యాయస్థానం, విచారణ వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సహా ప్రతివాదులుగా ఉన్న 8 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ కేసుపై హైకోర్టు రెండు వేర్వేరు తీర్పులిచ్చాయి.