భారత్ సహా నాలుగు దేశాల్లో భూకంపం
భారత్ తో సహా నాలుగు దేశాల్లో భూకంపం సంభవించడంతో మరోసారి ప్రజలను భయందోళనతో పరుగులు తీశారు. భారత్ , మయన్మార్, జపాన్, కోరల్ సముద్రంలో భూకంపం సంభవించింది. భారత్ లో 3 తీవ్రతతో స్వల్ప భూకంపం, కోరల్ సముద్రంలో 6 తీవ్రతతో భీకర భూకంపం నెలకొంది. అయితే నాలుగు దేశాలలో ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు ప్రకటించకపోవడంతో ఊపిరి పిల్చుకున్నారు .భూకంపం ప్రజలను ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. భారత్ , మయన్మార్తో సహా నాలుగు దేశాలలో ఈరోజు భారీ భూకంపం వచ్చింది. భారత్ దేశంలో 3-తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించగా, కోరల్ సముద్రంలో 6-తీవ్రతతో వాటిల్లిన భారీ భూకంపం ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది.
భూకంపాలు ఈ మధ్య కాలంలో ప్రజల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి . బలమైన ప్రకంపనల కారణంగా కొన్ని చోట్ల భారీగా ప్రాణ నష్టం, మరికొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా మరో నాలుగు దేశాలలో భూప్రకంపనలు సంభవించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. ఇవాళ ఉదయం కోరల్ సముద్రంలో సంభవించిన భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రం రీజియన్ లోని వనౌటులో కూడా కనిపించింది. అదే సమయంలో జపాన్, మయన్మార్, భారతదేశంలో కూడా భూకంపాలు వాటిల్లాయి.
కోరల్ సముద్రంలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అలాగే ఉదయం 4:58 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం వనువాటు సమీపంలో కూడా 6.0 తీవ్రతతో నమోదైందని పేర్కొంది. భూమి ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో కనుగొనబడిందని.. ఇది ప్రమాదకరమైనదిగా నిరూపించబడిందని తెలిపింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేనప్పటికీ ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి.
జపాన్, మయన్మార్ లలో భూకంపం మరోవైపు జపాన్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. ఈ తీవ్రత భూకంపం ఉత్తర జపాన్లోని తూర్పు హక్కైడో ప్రాంతాన్ని కుదిపేసింది. ఈ ప్రకంపనలు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. దీంతో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అలాగే మయన్మార్లో ఉదయం 4:42 గంటలకు భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3గా నమోదైంది.
కర్ణాటకలో భూకంపం
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. ఆదివారం ఉదయం భారతదేశంలోని కర్ణాటక, లడఖ్ రాష్ట్రాలలో భూకంపం సంభవించింది. కర్ణాటకలో భూకంపం తెల్లవారుజామున 3:47 గంటలకు సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో నమోదైంది. అదే సమయంలో లడఖ్లో ఉదయం 7:30 గంటలకు భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో నమోదైంది.

