Businesshome page sliderHome Page SliderNationalNewsviral

ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మళ్లీ అంబానీదే అగ్రస్థానం

భారత కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి భారతదేశంలో ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మొదటిస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇటీవలి రోజుల్లో రూపాయి బలహీనపడటం, సెన్సెక్స్ పడిపోవడంతో ఫోర్బ్స్ జాబితాలోని 100 మంది ధనవంతులైన భారతీయుల సంపద 9 శాతం తగ్గి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో అతని మొత్తం నికర ఆస్తుల విలువ 12 శాతం తగ్గిపోయింది. 14.5 బిలియన్ల డాలర్లు తగ్గి 105 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితాలో రెండవ స్థానంలో మౌలిక సదుపాయాల దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. అతని మొత్తం నికర ఆస్తుల విలువ 92 బిలియన్ డాలర్లు. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌ బర్గ్ రీసెర్చ్ మోసపూరిత లావాదేవీల ఆరోపణలను నిరూపించలేమని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొనడంతో అదానీకి కొంత ఉపశమనం లభించింది. కానీ అప్పటికే హిండెన్‌ బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి.