Breaking Newshome page sliderHome Page SliderNationalNewsPoliticsviral

RSS “సంఘ్ గీత్” ఆల్బమ్‌ విడుదల

నాగపూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శనివారం, సెప్టెంబర్ 27న 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సెప్టెంబర్ 28నాడు RSS చీఫ్ మోహన్ భగవత్ “సంఘ్ గీత్” ఆల్బమ్‌ ను విడుదల చేశారు. నాగ్‌ పూర్‌ లో జరిగిన సంఘ్ గీత్ ఆవిష్కరణ కార్యక్రమంలో, భగవత్ ఈ పాటను మాతృభూమికి అంకితం చేశారు. మాతృభూమి పట్ల భక్తి, నిష్ఠ కలిగిన జీవితం వివరించడమే సంఘ్ గీత్ అని ఆయన అన్నారు. RSS విజయదశమి (అక్టోబర్ 2) నాడు తన శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. కేవలం 24 మంది స్వచ్ఛంద సేవకులతో స్థాపించిన సంఘ్, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా విస్తరించింది. శతాబ్ది సంవత్సరంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది.
ఈ ఆల్బమ్‌లో సంఘ్ కు సంబంధించిన పాటల సమాహారం ఉంది. ఈ పాటలు స్వచ్ఛంద సేవకుల జీవిత అనుభవాల నుండి ఉద్భవించాయి. “సంఘ్ గీత్” ఆల్బమ్‌లో శంకర్ మహదేవన్ 25 పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో పెద్దల ఎదుట మహదేవన్ వీటిలో 10 పాటలను పాడి వినిపించారు. RSS ప్రతి భారతీయ భాషలోనూ దాదాపు 25,000 నుండి 30,000 పాటలు పాడిందని RSS చీఫ్ మోహన భగవత్ అన్నారు. ఈ పాటల సారాంశం అంకితభావ స్ఫూర్తిలో ఉంది. వాటి స్వరకర్తల పేర్లను గుర్తించడం చాలా కష్టమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. సంఘ్ గీత్ ఆవిష్కరణను ఒక చారిత్రాత్మక సంఘటనగా నితిన్ గడ్కరీ అభివర్ణించారు. ఈ పాటలు దేశభక్తికి ప్రేరణగా పనిచేస్తాయని ఆయన అన్నారు. ప్రతి సంఘ్ గీత్ ఎంతో స్ఫూర్తిదాయకమైనదని, విలువైన జీవిత పాఠాలను నేర్పుతుందని సీఎం ఫడ్నవీస్ అన్నారు. దసరా నాడు నాగ్‌ పూర్‌లో జరిగే RSS శతాబ్ది స్థాపనను పురస్కరించుకుని జరిగే ప్రధాన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సంఘ్‌ చాలక్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.