పొలిటీషియన్స్ మోర్ పవర్ అంటే జర్నలిస్టులు మోర్ ఫ్రీడమ్ అంటారు-సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా సమస్యలు వెలికి తెచ్చి పరిష్కరింపజేయడం జర్నలిస్టులకే సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్రభారతిలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కార ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని… పరిపాలనలో అనుభవజ్ఞులు సూచనలు తీసుకుని మా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర తగ్గుతోందన్న రేవంత్, ఇది మనకు ప్రమాదకరమైన ప్రమాదకర పరిణామన్నారు. జాతీయస్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని, తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీపై ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, , పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
