Andhra PradeshNews

గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ

Share with

గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్ పోటీ చేస్తారంటూ బాంబు పేల్చారు. పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వెళ్తే.. గన్నవరం, గుడివాడ వెళ్తారా ఆనాల్సిన దుస్థితి టీడీపీలో నెలకొందన్నారు వంశీ. టీడీపీ అధినేత చంద్రబాబుపై నాని తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి పేరు కూడా చెప్పుకోని చంద్రబాబు, మామ స్వర్గీయ ఎన్టీఆర్‌కు వర్ధంతులు, జయంతులు నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒక మాట అంటే సింపతి కోసం ఎక్కిఎక్కి ఏడ్చే చంద్రబాబు….. తన తండ్రి ఖార్జురపు నాయుడిని వెయ్యి మాటలు అన్నా పట్టించుకోడని ధ్వజమెత్తారు. మామ ఎన్టీఆర్‌కే కాదు అవకాశం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. 2024లో వైసీపీని ఆశీర్వదించి మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు నాని.