NewsTelangana

ఈడీ ఎదుట విజయ్‌ దేవరకొండ

పాన్‌ ఇండియా యాక్టర్‌ విజయ్‌ దేవరకొండ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. కొద్ది నెలల క్రితం విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా లైగర్‌ లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈడీ విచారణకు ఆ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మి హాజరయ్యారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండను విచారిస్తున్నారు. లైగర్‌ సినిమా నిర్మాణానికి నిధుల వ్యవహారంలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ నేతకు ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధం ఉందని భావిస్తున్నారు. దీంతో లైగర్‌ సినిమా నిర్మాణంతో సంబంధం ఉన్న వాళ్లందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.