Andhra PradeshHome Page Slider

కందుకూరు మృతులకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా

మృతుల కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం

కందుకూరు ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘటనలో గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం అందించాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న సీఎం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.