రాజస్థాన్లో మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు
రాజస్థాన్లోని బిషన్గఢ్లో అలీలా ప్యాలెస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని ఆశ్చర్యపరిచారు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావులు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వీరు తెలంగాణలోని వనపర్తిలో ఉన్న 400 ఏళ్ల నాటి రంగనాయక స్వామి దేవాలయంలో బంధువుల సమక్షంలో సింపుల్గా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్లో మరోసారి పెళ్లి చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.