సైనిక నియామకాలకు పుతిన్ ఆదేశం
ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సైనిక నియామకాలకు ఆదేశాలు జారీ చేశారు పుతిన్. కొత్తగా లక్షా 37 వేల మందిని నియమించాలని ప్రకటించారు. సాయుధ బలగాల్లోకి వాలంటీర్లు, ప్రైవేట్ సైనికులు, ఖైదీలను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నియామకాలతో కలిపి సాయుధ బలగాల మొత్తం సంఖ్య 20,39,758కు చేరుతుందని రక్షణశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని తీవ్రతరంచేసే ఉద్దేశంతోనే వాలంటీర్లు, ప్రైవేటు సైనికులు, ఖైదీలను సైన్యంలో నియమించేందుకు క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యా మీడియా పేర్కొంది. కాగా, తూర్పు ఉక్రెయిన్లో సైనికులకు పరికరాలను తీసుకెళ్తున్న రైలుపై బుధవారం రష్యా చేపట్టిన రాకెట్ దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 25కు చేరినట్టు అధికారులు తెలిపారు.