Home Page SliderTelangana

పీసీసీ చీఫ్ రేవంత్ కాన్వాయ్‌కు ప్రమాదం.. ఢీకొన్న ఆరు కార్లు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్వల్ప ప్రమాదం చోటుచేసుకొంది. రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. 4 కార్లతోపాటు, 2 టీవీ చానెళ్ల కార్లు సైతం దెబ్బతిన్నాయి. కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కార్లలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధులు ఘటనలో గాయపడ్డారు. ఐతే ప్రమాదంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన పాదయాత్రను యాథావిథిగా కొనసాగిస్తున్నారు.