Home Page SliderTelangana

10 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది.. రైతు భరోసా ఇస్తాం: రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉపసంహరించుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత మాత్రమే బీఆర్ఎస్ నేతలకు ఉందని విమర్శించారు. మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యల వల్ల రైతుబంధుకు ఈసీ అనుమతి రద్దుచేసింది. ఆ వ్యాఖ్యలే కారణమని ఈసీ చెప్పింది. హరీష్‌రావు నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం సీఎం కేసీఆర్, హరీష్‌కు లేదు. రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. 10 రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేలు రైతు భరోసా ఇస్తాం అని రేవంత్‌రెడ్డి చెప్పారు.