వచ్చే నెలలో అందరూ జైలుకే..
మరోసారి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలోని ముఖ్యులపై పైల్స్ సిద్ధమై ఉన్నాయన్నారు. నవంబర్ 1 నుండి 8వ తేదీ మధ్యలో అందరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో నిక్షిప్తమైన ఆధారాలు ఉన్నాయంటూ, గత ప్రభుత్వ కాలంలో జరిగిన తప్పులపై ఖచ్చితమైన సమాచారం బయటకు రానుందని మంత్రి పేర్కొన్నారు. ఇక, ఇరవై రోజుల్లోనే తీవ్రమైన వార్తలు వెలువడతాయని బాంబు పేల్చారు. దీపావళి ముందు పొలిటికల్ షాకులు జరుగుతాయన్నారు. ఎవరైనా తప్పు చేసినా దానికి వారు తప్పించుకోలేరని పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.