Home Page SliderTelangana

మార్చిలోనే విపరీతమైన ఎండ వేడిమి!

హైదరాబాద్: దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. గతంలో మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే మార్చి నెలలో 40 డిగ్రీలు నమోదయ్యేవి. ప్రస్తుతం దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తల బృందం క్లైమేట్ సెంట్రల్ వెల్లడించింది. ఈ బృందం 1970 నుండి ఇప్పటివరకు భారతదేశంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నుల్ని విశ్లేషించింది. దీని ప్రకారం ఉత్తర భారతం సహా దేశంలోని పలురాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.