NewsTelangana

మునుగోడులో ధర్మమే గెలిచింది

మునుగోడు ఉప ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని మంత్రి జగదీష్‌ గౌడ్‌ అన్నారు. రాజగోపాల్‌ రెడ్డి ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసార్‌ వెంటే ఉన్నారంటూ మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు. 7 మండలాల్లోనూ గులాబీ గుబాళించింది. ఒక్క చౌటుప్పల్‌లోనే కమలం కాస్త టఫ్‌ ఫైట్‌ ఇచ్చింది.